త్రిపుర గ్రామీణ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు ద్రవ్య జరిమానా విధింపు
మే 15, 2023 త్రిపుర గ్రామీణ బ్యాంక్ పై భారతీయ రిజర్వు బ్యాంకు భారతీయ రిజర్వు బ్యాంకు, మే 10, 2023 నాటి తమ ఆర్డర్ ద్వారా “ప్రూడెన్షియల్ నిబంధనలను బలోపేతం చేయడం - ప్రొవిజనింగ్, అసెట్ క్లాసిఫికేషన్ మరియు ఎక్స్పోజర్ పరిమితులు' మరియు 'ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు - ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ మరియు ప్రొవిజనింగ్'లను నిబంధనలు - 'నాన్-పెర్ఫార్మింగ్ అసెట్ (NPA)' పై ఆర్బిఐ (RBI) జారీ చేసిన ఆదేశాలను పాటించనందులకు / ఉల్లంఘించినందులకు త్రిపుర గ్రామీణ బ్యాంక్, అగర్తల, త్రిపుర (బ్యాంక్) పై ₹2.00 లక్షల (రెండు లక్షల రూపాయలు మాత్రమే) జరిమానాను విధించింది. బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949 లోని సెక్షన్ 46(4) (i) మరియు సెక్షన్ 51 (1) తో కలిపి, సెక్షన్ 47A (1)(c) లోని అధికారాలను వినియోగించుకొని, ఆర్బిఐ (RBI) చే జారీచేయబడ్డ పై ఉటంకించబడిన ఆదేశాలను బ్యాంక్ పాటించనందులకు, ఆర్బిఐ (RBI) ద్వారా ఈ జరిమానా విధించబడింది. ఈ చర్య నియంత్రణ అనుపాలన లోని లోపాలపై ఆధారపడి తీసుకున్నదే గాని, బ్యాంక్ తన వినియోగదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటుపై వ్యక్తీకరించే వొక అభిప్రాయంగా మాత్రం అన్వయించుకోరాదు. నేపథ్యo మార్చి 31, 2022 తేదీ నాటి బ్యాంక్ ఆర్థిక స్థితికి సంబంధించి నాబార్డ్ (NABARD) చట్టబద్ధమైన తనిఖీ ని నిర్వహించింది మరియు వారి తనిఖీ నివేదికను పరిశీలించిన మీదట, మిగతావాటితోపాటు, ఆ బ్యాంక్ నిర్దిష్టమైన కొన్ని ఋణ ఖాతాలను IRAC నిబంధనల ప్రకారం 'నాన్-పెర్ఫార్మింగ్ ఖాతాలుగా” వర్గీకరించడంలో విఫలమైందని వెల్లడయ్యింది. పైన పేర్కొన్న వాటి ఆధారంగా, భారతీయ రిజర్వు బ్యాంకు జారీ చేసిన ఆదేశాలను ఉల్లంఘించినందులకు, జరిమానా ఎందుకు విధించకూడదో కారణం చూపాలని కోరుతూ బ్యాంక్ కు వొక నోటీసు జారీ చేయబడింది. నోటీసుకు బ్యాంక్ ఇచ్చిన ప్రత్యుత్తరo, అదనంగా ఇచ్చిన సమర్పణలు మరియు వ్యక్తిగత విచారణ లోని మౌఖికఅంశాలను పరిగణనలోకి తీసుకున్న తదుపరి, ఆర్బిఐ (RBI) ఆదేశాల అమలు జరుగలేదని పైన పేర్కొన్న అభియోగం వాస్తవమని మరియు ద్రవ్య జరిమానా విధించదగినదేనని, భారతీయ రిజర్వు బ్యాంకు వొక నిర్ధారణకు వచ్చింది. (యోగేష్ దయాల్) పత్రికా ప్రకటన: 2023-2024/233 |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: