రైస్ పుల్లింగ్ కుంభకోణంపై, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక
జులై 31, 2018 'రైస్ పుల్లింగ్' కుంభకోణంపై, రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిక కొంతమంది మోసగాళ్ళు, రాగి/ఇరిడియంతో తయారుచేసిన, 'రైస్ పుల్లర్' అనే పేరుగల సాధనాన్ని, అమ్ముతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ దృష్టికి వచ్చినది. ఈ సాధనం, బియ్యపు గింజలని తనవైపు ఆకర్షించే అద్భుత శక్తి కలిగి ఉందని చెపుతున్నారు. ఈ మోసంలో పాలుపంచుకుంటున్న వ్యక్తులు, ప్రభుత్వ సెక్యూరిటీల వేలానికి సంబంధించిన సర్క్యులర్లనీ, రిజర్వ్ బ్యాంక్ / ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్లని, వక్రీకరించి, ఈ సాధనాల అమ్మకందారుల కార్యకలాపాలకి, రిజర్వ్ బ్యాంక్ ధన సహాయం అందిస్తోందని, మోసంచేస్తున్నారు. ఇటువంటి తప్పుడు విషయాలు నమ్మవద్దని, వీటి మాయలో పడవద్దని, రిజర్వ్ బ్యాంక్, ఇందుమూలముగా, ప్రజలను హెచ్చరిస్తున్నది. ఇటువంటి సంఘటనలను, పరిశోధనా అధికారుల దృష్టికి తేవలెను. పైన తెలిపిన మోసకారులతో, సంబంధాలు, ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. అందువల్ల ప్రజలు, వారి స్వంత క్షేమం కొరకు, ఇట్టి విషయాలకు ఏ విధంగానూ జవాబు ఇవ్వరాదు. అజిత్ ప్రసాద్ పత్రికా ప్రకటన: 2018-2019/270 |
పేజీ చివరిగా అప్డేట్ చేయబడిన తేదీ: